ముక్కోటి ఏకాదశికి శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలను
నిర్వహించనున్నామని కార్యనిర్వాహణాధికారి వి.హనుమంతరావు తెలిపారు. భక్తుల
రద్దీ దృష్ట్యా ఆలయ వేలల్లో మార్పులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 3గంటలకు
ఆలయ ద్వారాలను తెరచి మంగళహారతులు, మూడున్నర్ర గంటలకు సుప్రభాతసేవలను
నిర్వహించి భక్తులకు స్వామిఅమ్మవార్లు దర్శనమివ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఉదయం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లు రావణ వాహనంలో ఆసీనులై ఉత్తర
ద్వారమైన శివాజీ గోపురం మీదుగా గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు
పేర్కొన్నారు. దేవస్థానంలో నేడు అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల
చేస్తున్నట్లు భక్తులు ఆ విషయాన్ని గమనించగలరని ఆయన తెలిపారు.రాష్ట్ర ఎన్నికల అధికారి కమిషనర్ బన్వర్లాల్ కుటుంబసమేతంగా స్వామి
అమ్మవార్లను దర్శించారు. వీరికి సాధరంగా దేవస్థానం కార్యనిర్వాహణాధికారి
హనుమంతరావు, ఆలయ ఎఇఓ సదానందం, వసతి గృహ ఎఇఓ రాజశేఖర్, అర్చకులు, వేదపండితుల
నడుమ ఘనంగా ఆహ్వానం పలికి స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి
కుంకుమార్చనాది కార్యక్రమాలను నిర్వహించి శేషవస్త్రాన్ని, స్వామి వారి
జ్ఞాపికను స్వీకరించారు.
No comments:
Post a Comment