Tuesday, 6 December 2011

శ్రీశైలం మల్లన్న గాలిగోపురానికి బీటలు

పాలకుల పర్యవేక్షణలోపం... అధికారుల నిర్లక్ష్యం వెరసి శ్రీశైలం మల్లన గాలిగోపురం పాలిటశాపంలా తయారైంది. పురాతన కాలంనాటి ఆయలగోపురశిఖరాలపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యపు దోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. శ్రీశైలం మల్లన్న గాలిగోపురం పిచ్చిమొక్కలతో కళావిహీనంగా తయారైంది.
గాలి గోపురాన్ని పునరుద్ధరించే విషయంలో పాలకమండలి, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శులు వెల్లువెత్తున్నాయి. నిత్యం రద్ధీగా ఉండే శ్రీశైల క్షేత్రంలో గాలిగోపురాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. గోపురాలపై ఉన్న శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర ద్వారంగాఉన్న శివాజీ గోపురం శిధిలావస్థకు చేరుకుందని రెండేళ్లక్రితం నిపుణుల కమిటీ నిర్థారించింది. గోపురాన్ని పునరుద్ధరించాలనే సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. గోపురం బీటలు వారుతున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గోపురాలపై శిల్పాలు విరిగిపోవడంతోపాటు పిచ్చిమొక్కలతో కళావిహీనంగా ఉన్నాయి. పురాతన కాలంనాటి శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారులు చొరవతీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

No comments:

Post a Comment