గుంతకల్లు, కదిరి మీదుగా తిరుపతి - హైదరాబాద్ మధ్య మరిన్ని రైళ్లు
నడిపేందుకు వచ్చే బడ్జెట్లో తగు నిర్ణయం తీసుకుంటామని రైల్వే శాఖ సహాయ
మంత్రి కేహెచ్ మునియప్ప స్పష్టం చేశారు. ఆయన కుటుంబ
సమేతంగా కదిరిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం
విలేకరులతో మాట్లాడారు. ధర్మవరం-పాకాల రైలు మార్గంలో గతంలో మీటర్ గేజ్
ఉన్నప్పుడు హైదరాబాద్- తిరుపతి మధ్య వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నడిచే దని,
దాన్ని మళ్లీ ఇదే మార్గంలో తిప్పేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ప్రస్తుతం వారంలో రెండు రోజుల పాటు కదిరి మీదుగా సికింద్రాబాద్- తిరుపతి
మధ్య నడుస్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ రైలును ప్రతి రోజు నడిపేందుకు కృషి
చేస్తామన్నారు. కదిరి- పుట్టపర్తి, చిక్బళ్లాపూర్- పుట్టపర్తి మధ్య
ఏర్పాటు చేయనున్న కొత్త రైలు మార్గానికి తమ వాటాగా చెల్లించాల్సిన నిధులను
ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు ఇప్పటికే అంగీకరించాయన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
No comments:
Post a Comment