Saturday, 3 December 2011

ప్రతి జిల్లాలో ఆధ్యాత్మిక గ్రంథాలయం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో టిటిడి ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయం, గో సంరక్షణశాలను ఏర్పాటు చెయ్యాలని యోచిస్తున్నట్లు టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతి నెలా తొలి నిర్వహించే డయల్ యువర్ ఇఓ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని టిటిడి సమాచార కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఇఓ సమాధానమిచ్చారు. నెల్లూరుకు చెందిన చందు అనే భక్తుడి ప్రశ్నకు సమాధానంగా ఇఓ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొదించనున్నట్లు తెలిపారు. అలాగే గో సంరక్షణతోనే సామాజిక సంరక్షణ సాధ్యమని టిటిడి భావించి ప్రతి జిల్లాలొ ఒక గోశాలను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment