
తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్
రెడ్డి గత ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని బుజ్జగించే ప్రయత్నంలో
పడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన
నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెసు నాయకత్వంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం
చేశారు. తమను గడ్డిపోచల్లా చూస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజారాజ్యం పార్టీకి చెందిన శానససభ్యులు చిరంజీవి వద్ద తమ ఆవేదనను
వెళ్లబోసుకున్నారు. ఈ స్థితిలో తన వర్గం శానససభ్యులతో చిరంజీవి రేపు
ఆదివారం అత్యవసరంగా సమావేశమవుతున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన 17
మంది శాసనసభ్యులకు కాంగ్రెసు జారీ చేసే విప్ వర్తించదు. దీంతో అవిశ్వాసంపై
ఓటింగు సందర్భంగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఏ కొద్ది మంది జారిపోయినా
ప్రభుత్వం చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. దీంతో కాంగ్రెసు కలవరానికి
గురవుతోంది. ప్రభుత్వ విప్ కొండ్రు మురళి చిరంజీవికి ఫోన్ చేసి
మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు
చేసేలా చూడాలని ఆయన చిరంజీవిని అభ్యర్థించారు.
No comments:
Post a Comment