Saturday, 12 November 2011

ఆరు నెలలలో చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి?

ప్రజారాజ్యం పార్టీని తమ పార్టీలో విలీనం చేసిన చిరంజీవిని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనను తుడిచిపెట్టడానికి కాంగ్రెసు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అది కూడా సాధ్యమైనంత త్వరగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన సాగుతోంది. రాజ్యసభకు గానీ లోకసభకు గానీ ఎంపిక కాక ముందే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలలలోగా పార్లమెంటు ఉభయసభల్లో దేనికైనా ఒకదానికి ఎంపికైతే చాలు. అందువల్ల ముందు చిరంజీవిని మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక చేయాలనే ఆలోచన సాగుతోంది. ఏప్రిల్ లేదా మేలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు సీటు కేటాయిస్తారని అంటున్నారు

No comments:

Post a Comment