Saturday, 12 November 2011

తెలుగు సినిమాలు అర్థం కావడం లేదు

ravi
ప్రస్తుతం వస్తున్న తెలుగు చిత్రాలు తమవంటి వారికి అర్థం కావడం లేదని, అసలు తారల పేర్లు కూడా గుర్తు ఉండడం లేదని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. అలనాటి తెరవేల్పులు, ప్రముఖ నటీమణుల్ని కళాసుధ తెలుగు అసోసియేషన్ 'కళామతల్లికి వందనం' పేరుతో శుక్రవారం ఘనంగా సత్కరించింది. అరుదుగా వచ్చే ప్రత్యేకమైన రోజైన 11-11-11 తేదీని పురస్కరించుకుని 11 మంది పాత తరం నటీమణులను సంస్థ నిర్వాహకులు సత్కరించా రు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక కామరాజర్ అరంగంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. .
ఆ రోజుల్లో పాటలు ఆపాత మధురంగా ఉంటే, నేటి పాటల్లో మాటలేమిటో తెలియడం లేదన్నారు. మళ్లీ కుటుంబంతో కలిసి చూసే మంచి సినిమాలు రావాలన్నారు. 

No comments:

Post a Comment