Saturday, 12 November 2011

మంత్రి రఘువీరారెడ్డి చేతిలో నుంచి మైకు లాక్కున్ రాయదుర్గం ఎమ్మెల్యే

రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డితో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగిన ఉదంతమిది. రాయదుర్గం పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి రఘువీరా ప్రసంగిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందోనంటూ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. దీంతో ఒక్కసారిగా రామచంద్రారెడ్డి మంత్రి చేతిలో నుంచి మైకు లాక్కుని ఆవేశంగా ప్రసంగించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం అత్యంత బాధాకరమన్నారు. కొంతమందికి మాత్రమే సంక్షేమ ఫలాలను అందించి అందరికీ అందించినట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వేదిక కాదంటూనే రాజకీయం చేస్తున్నారని మంత్రితో వాగ్వాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సహకరించే వారి పనులు జరుగకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు

No comments:

Post a Comment