Thursday, 24 November 2011

హోరాహోరీ కాల్పుల్లో కిషన్‌జీ మృతి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు ఆలియాస్ కిషన్‌జీ గురువారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. పశ్చిమబెంగాల్‌లోని కుష్బోనీ అడవిప్రాంతం, జంగల్ మహల్‌లో భద్రతాదళాలు-మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందారు. ఈ ఘటనలో మరో మహిళా నక్సలైట్ కూడా మృతి చెందిన నట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కిషన్‌జీది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి.

No comments:

Post a Comment