Thursday, 24 November 2011

వైయస్ విజయమ్మ బాధపడుతుంటారు: పయ్యావుల

తెలుగుదేశం పార్టీ వాదన ఇప్పుడు విని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బాధపడుతుంటారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. హైకోర్టును తప్పుదోవ పట్టించే విధంగా విజయమ్మతో పిటిషన్ వేయించారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బినామీ కర్నాటి వెంకటేశ్వర రావు వైయస్ హయాంలోనే వెలుగులోకి వచ్చారన్నారు. కర్నాటి, కెవిపి రామచంద్రా రావు ఒకే భవనంలో ఉంటారన్నారు.

No comments:

Post a Comment