Thursday, 24 November 2011

కిషన్‌జీ ఎన్‌కౌంటర్: చంద్రబాబుకు భద్రత పెంపు

మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి భద్రత పెంచారు. రైతు పోరు బాటలో భాగంగా చంద్రబాబు ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని బుచ్చయ్యపేటలో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో చంద్రబాబుకు భద్రత పెంచారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చి పోయే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు

No comments:

Post a Comment