ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. బస్సుల రాకపోకల సమాచారం కచ్చితంగా తెలుసుకునేందుకు వీలుగా మొబైల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికులకు సెల్ఫోన్లు అందజేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల మందికి సీయూజీ ఉచిత సెల్ఫోన్లను ఇచ్చారు. దీనివల్ల ప్రయాణికులకు మరింత సమాచారం అందుబాటులోకి వస్తుందని, తద్వారా ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని ఆ సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మొబైల్ సేవల కు సంంధించి కర్నూలులో ఉన్న ఆర్టీసీ సంస్థ ప్రాంతీయాధికారి పి. కృష్ణమోహన్కు ఇప్పటికే ఉత్తర్వులు అందా యి.
కర్నూలులో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు 5,048 మంది బీఎస్ఎస్ఎన్ మొబైళ్లు పంపిణీ చేశారు. ఇక నుంచి ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులు క్షేత్రస్థాయి నుంచే అధికారులు నిర్ణయాలను తీసుకొనవచ్చని కృష్ణమోహన్ తెలిపారు. ఫోన్పై ప్రతినెలా రూ. 29 అద్దెను ఆర్టీ సీ భరిస్తుందని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కాకుండా ఇతర ఫోన్లకు కాల్ చేస్తే చార్జి పడుతుందన్నారు.
కర్నూలులో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు 5,048 మంది బీఎస్ఎస్ఎన్ మొబైళ్లు పంపిణీ చేశారు. ఇక నుంచి ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులు క్షేత్రస్థాయి నుంచే అధికారులు నిర్ణయాలను తీసుకొనవచ్చని కృష్ణమోహన్ తెలిపారు. ఫోన్పై ప్రతినెలా రూ. 29 అద్దెను ఆర్టీ సీ భరిస్తుందని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కాకుండా ఇతర ఫోన్లకు కాల్ చేస్తే చార్జి పడుతుందన్నారు.
ఉపయోగాలివే.
- ఆర్టీసీ సిబ్బంది మధ్య సమన్వ యం కుదురుతుంది. సమాచారం ఇచ్చిపుచ్చుకుంటారు.
- ఆర్టీసీ బస్సు గ్యారేజీలో బ స్సుల మరమ్మతుల వివరాలను తెలుసుకొనవచ్చు.
- బస్సులు సకాలంలో బలుదేరుతున్నాయో లేదో డిపోమేనేజర్లు, సూ పర్వైజర్ల ద్వారా తెలుసుకొనవచ్చు.
- బస్సులు మార్గమధ్యలో ఆగిపోతే ఆ బస్సుల వివరాలను డిపో మే నేజర్లకు, చీఫ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లకు కండక్టర్లు, డ్రైవర్లు వివరించవచ్చు.
- బస్సులు సరైన సమయంలో నడిపేందుకు అవకాశం ఉంటుంది.
- ప్రస్తుతం బస్సు రాకపోకల వివరాలు సక్రమంగా తెలియక ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ సేవల వల్ల ఈ ఇబ్బందులు చాలావరకు తొలగిపోతాయి
No comments:
Post a Comment