Thursday, 24 November 2011

ఓటరు నమోదు...తూతూ మంత్రం

 ఓటరు నమోదు ప్రక్రియలో ఎ న్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీగా జాబితా రూపొందించాలనే ఆదేశం మేరకు  కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక ఓట ర్ల నమోదు, పర్యవేక్షణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అత్యవసర స మావేశం జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీలకు చెందిన నేతలు డుమ్మాకొట్టగా, ప్రధాన పార్టీలకు చెందిన కింది స్థాయి నాయకులు హాజరైనా ఎలాం టి అవగాహన లేకపోవడంతో అధికారులు చెప్పినదానికి తలలు ఆడించి వె నుతిరిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,829 పోలిం గ్ కేంద్రాలకు రిటర్నింగ్ స్థాయి అధికారులను ఏర్పాటు చేస్తామని ఓటర్ జా బితాలో తప్పులు, పొరపాట్లు లేకుం డా బూత్ స్థాయి ఏజెంట్లు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షించేందుకు బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలని ఆదేశించారు. ప్రధాన ఎన్నికల అ ధికారి సూచనల మేరకు అన్ని పో లింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నమోదు కా ర్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించామని, ఈనెల 27వ తేదీ ప్రత్యేక న మోదు దినంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. బూత్‌స్థాయి అధికారులు, ఏజెంట్లు కలిసి సంయుక్తంగా తప్పులు లేకుండా ఓటర్ జాబితాను సిద్ధం చే సేందుకు బూత్‌స్థాయి ఏజెంట్లను ని యమించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.తప్పుఒప్పుల సవరణకు ఈ నెల 30వ తేదీ వరకు అవకా శం ఉందన్నారు

No comments:

Post a Comment