Thursday, 13 October 2011

భారత్, ఇంగ్లండ్ వన్డేకు భారీ భద్రత

బందోబస్తు ఏర్పాట్లపై ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, క్రైమ్, ఆర్మ్‌డ్ రిజర్వు, సెక్యూరిటీ విభాగం అధికారులతో బుధవారం తన కార్యాలయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అల్వాల్ డీసీపీ కె.వెంకటేశ్వరరావుతో కలిసి కమిషనర్ ఉప్పల్ స్టేడియంను పరిశీలించారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలను కమిషనర్, డీసీపీకి వివరించారు. అన్ని కోణాలలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు తిరుమలరావు పేర్కొన్నారు.

బందోబస్తులో...

ముగ్గురు డీసీపీలు
10 మంది అదనపు డీసీపీలు
30 మంది ఏసీపీలు
100 మంది ఇన్‌స్పెక్టర్లు
300 మంది ఎస్‌ఐలు
1500 మంది కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు
500 మంది హోంగార్డులు, స్పెషల్ అధికారులు
4 కంపెనీల ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలు
3000 మంది పోలీసుల పహారా
50 సీసీ కెమెరాల ఏర్పాటు
టికెట్‌పైనే సీట్ నెంబర్‌తోపాటు వాహన పార్కింగ్ ప్రదేశం సూచిక

No comments:

Post a Comment