ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ను వదులుకునేదిలేదని రాయలసీమ హక్కుల వేదిక చైర్మన్, మంత్రి టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విడిపోతామా? కలిసి ఉంటామా? అనే చర్చను వీడి అభివృద్ధి అసమానతలపై చర్చించాలని సూచించారు. సమ్మెతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, పెట్టుబడులు ఆంధ్రకు తరలుతున్నాయని టీజీ పేర్కొన్నారు
No comments:
Post a Comment