Thursday, 13 October 2011

కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహారదీక్షలు సీపీఐ

      
                              


ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 21న మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పులి కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అధిక ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని విమర్శించారు. రైతులు కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోందని దుయ్యబట్టారు.

ఈ నెల 17, 18 తేదీల్లో కరువు పరిశీలనకు సీపీఐ రాష్ట్ర బృం దం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వస్తోందన్నారు

No comments:

Post a Comment