Sunday, 16 October 2011

పంట నష్టం భారీ!

జిల్లాలో 5.98 లక్షల హెక్టార్లలో సాగు చేసిన ఖరీఫ్ పంటలు వర్షాభావం వల్ల దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మొత్తం 9.45 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. సెప్టెంబర్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు ఏడీఏ, ఏఓలు సమగ్ర నివేదిక తయారుచేశారు. ఇందులో 5.75 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లినట్లు పొందుపరిచారు. జిల్లాలో 7.07 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగులోకి వచ్చిందని, అందులో మొదటి విడతగా విత్తుకున్న 1.32 లక్షల హెక్టార్ల పంట కొంతవరకు బాగున్నా, రెండు, మూడు విడతలుగా వేసుకున్న పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు నమోదు చేశారు. 

No comments:

Post a Comment