Sunday, 16 October 2011

దేశంలో వివిధ ప్రైవేటు పథకాలకు దీటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టారు

                                
దేశంలో వివిధ ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాలకు దీటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ మేరకు శనివారం స్థానిక స్టేట్ బ్యాంకులో చీఫ్ మేనేజర్ ఎన్.వెంకటయ్య వివిధ స్కీములను లాంచింగ్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా కార్లు, ఇళ్లు, అన్ని వాహనాలకు, స్టాక్స్, షాపులు, బిల్డింగ్‌లకు తక్కువ ప్రీమియంతో ప్రతి ఒక్కరూ లబ్ధిపొందవచ్చని వెంకటయ్య తెలిపారు. వివిధ వాహనాల మరమ్మతుల నిమిత్తం 56 రకాలకు ఈ పథకం వర్తించనున్నది. ఏదైనా వాహనం ప్రమాదానికి గురైతే సంబంధిత వాహనదారుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా 7 రోజులలోపు ఆ వాహనాన్ని గ్యారేజీకి తీసుకెళ్లడానికి ఇన్సూరెన్స్ ఉన్నవారికి బ్యాంకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఇంత వరకు ఈ పథకాన్ని ఏ సంస్థ కూడా ప్రవేశపెట్టలేదని ఆయన చెప్పారు. అలాగే ఈ ఏడాది 4000 మంది రైతులకు రూ.12 కోట్లు రాయచోటి ఎస్‌బిఐ పరిధిలో రుణాలు ఇచ్చామని సంబంధిత రైతులు బీమా చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయం సహాయక గ్రూపులకు తమ బ్యాంకు నుంచి 1000 మహిళా గ్రూపులకు ఎనిమిది కోట్ల రూపాయలను ఇప్పటి వరకు పంపిణీ చేశామని, సక్రమంగా పని చేసే గ్రూపులకు మరింత ప్రోత్సాహాలు అందిస్తామని తెలిపారు. అలాగే రూరల్ బ్యాంకింగ్ డెవలప్‌మెంట్ ( ఆర్‌బిడి) మేనేజర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ ఛీఫ్ మేనేజర్ ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్‌లకు సంబంధించిన సందేహాలు తనను కలిసి నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు

No comments:

Post a Comment