Sunday, 8 January 2012

108 వాహనాల నిర్వహణ రవాణా శాఖ పరిధిలోకి

అత్యవసర వైద్య సేవల కోసం వినియోగిస్తున్న 108 వాహనాల నిర్వహణను ఆర్టీసీకి అప్పగించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ యోచిస్తున్నట్టు సమాచారం. 108ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోకపోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని భావిస్తున్న సత్తిబాబు 108ని రవాణా శాఖ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సగానికిపైగా 108 వాహనాలు షెడ్‌లకే పరిమితం కావడం పట్ల సత్తిబాబు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో 108 వాహనాల బాధ్యతను ఆర్టీసీకి అప్పగిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

No comments:

Post a Comment