మద్యం సిండికేట్పై వదలొద్దు...నేతలతో చంద్రబాబు
మద్యం సిండికేట్ల వ్యవహారంపై దీర్ఘకాలిక ఉద్యమం చేపట్టాలని తెలుగుదేశం
పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు
నాయుడు ఆదివారం పలువురు నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మద్యం
సిండికేట్ల వ్యవహారాన్ని ఉపేక్షించవద్దని ఆయన వారికి సూచించినట్లుగా
తెలుస్తోంది. దీనిని దీర్ఘకాలిక ఉద్యమంగా మలచాలని సూచించినట్లుగా
తెలుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంలో ఉన్నారని దీనిని
బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించినట్లుగా తెలుస్తోంది. పిసిసి
చీఫ్ బొత్స తీరును కూడా బాబు ఆక్షేపించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో
టిడిపి నేతలు ఉన్నా ఉపేక్షించవద్దని సూచించారని సమాచారం.రాష్ట్రంలోని మద్యం సిండికేట్ మాఫియాకు సంబంధించి అసలు గుట్టు బయటపడాలంటే
సిబిఐచే దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ వ్యవహారంపై
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేల హస్తం
ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ తరఫున ప్రజా ఉద్యమం
చేపడతామని అప్పటికీ స్పందించకుంటే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి నివాసం
ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఉప ఎన్నికల కోసం ముందస్తుగా భారీగా
ఖర్చు పెడుతోందన్నారు.
No comments:
Post a Comment