నగర, పట్టణ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆదివారం
అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు
నగర పాలక సంస్థ కమిషనర్ నీలకంఠారెడ్డి తెలిపారు. ఈ మేళాకు ఇరవై కంపెనీలు
హాజరవుతున్నాయన్నారు. ఇందులో తొమ్మిది ప్రముఖ కంపెనీలు ఉన్నాయని
వెల్లడించారు. శనివారం ఆయన తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. రాజీవ్
యువకిరణాలు పథకంలో భాగంగా అనంత నగర పాలక సంస్థ, జిల్లాలోని మున్సిపాలిటీలు,
అర్బన్ ఐకేపీ సంయుక్తంగా ఈ జాబ్మేళా నిర్వహిస్తున్నాయన్నారు. తొమ్మిది
ప్రముఖ కంపెనీలు 533 మందికి ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. మరో 11
సంస్థలు కూడా పలువురిని నియమించుకుంటాయని తెలిపారు. కేప్ కాఫీ డే సంస్థ
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 115, ఫ్యూచర్ రిటైల్స్ సంస్థ టీమ్
మెంబర్ పోస్టులు 60, బాటా బిర్లా సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు
18, జోయలుక్కాస్ సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 100, పీటీవీపీ
లిమిటెడ్ సంస్థ టోల్ ప్లాజా సపోర్ట్ టీమ్ పోస్టులు 50, పాన్టాలూన్ సంస్థ
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 30, ఆదిత్యా బిర్లా సంస్థ టీమ్ మెంబర్
పోస్టులు 50, అపోలో ఫార్మసీ సంస్థ టీమ్మెంబర్ పోస్టులు 50, షాపర్ స్టాప్
సంస్థ టీమ్ మెంబర్ పోస్టులు 60 భర్తీ చేస్తాయన్నారు. 18 -35 ఏళ్ల లోపు వారు
విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు
కావాలన్నారు. ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ వెంటనే ఇస్తారన్నారు.
No comments:
Post a Comment