అనంతపురం జిల్లాలో మహిళలకు రక్షణ లేని సమయంలో, శాంతి భద్రతలు సరిగా లేని
సమయంలో పరిటాల రవి రాజకీయంలోకి వచ్చినట్లు శ్రీమతి సునీత గుర్తు చేశారు. ఈ
సందర్భంగా రవి చేసిన అనేక కార్యక్రమాలను గురించి వివరించారు. పెనుకొండలో
5000 మంది పేదలకు వివాహాలు, కల్యాణమండపాలు, కాలేజీలు, విద్యార్థుల కోసం
పాఠశాలలు, స్కాలర్షిప్లు అందజేశారని ఆమె తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలు
నిర్విరామంగా కొనసాగించనున్నట్లు సునీత తెలిపారు. తనకు జరిగిన సత్కారానికి
కృతజ్ఞతలు తెలియజేస్తూ పరిటాల రవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రవి
కాంక్షించిన వితరణ కార్యక్రమాలు నిర్వహించదలచినట్టు, అలాగే పేద
విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు వివాహాలు నిర్వహిస్తున్నట్లు
తెలిపారు. కర్నూలు జిల్లాలో వరద ప్రాంతాలైన నిద్జూర్, భావపురం గ్రామాలను
దత్తత తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పనున్నట్లు
సునీత తెలిపారు. అలాగే ఫోన్స్, మరియు ఇంటర్నెట్ ద్వారా తెలుగు దేశం పార్టీ
చేసే సేవలను ప్రజలందరీకీ తెలియజేయడంలో తమవంతు సేవనందించవలసిందిగా సునీత
ప్రవాసాం«ద్రులను కోరారు.
న్యూజెర్సీలో జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో పరిటాల సునీత కుమారులు పరిటాల
సిద్ధార్థ, పరిటాల శ్రీరామ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు
400 మంది హాజరయ్యారు. ముందుగా పరిటాల సునీత జ్యోతి వెలిగించగా, పరిటాల రవి
జీవిత చరిత్ర 'అస్తమించిన రవి' డాక్యుమెంటరీతో కార్యక్రమం ప్రారంభమైంది.
వెంకట్ గరికపాటి ఈ వేడకను నిర్వహించగా, వంశీ ప్రియ వ్యాఖ్యాతగా వ్యవహరించి
తన మధురమైన గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే చిన్నారులు
అద్భుతమైన నృత్యాలను ప్రదర్శించారు.
వెంకట్ గరికపాటి మాట్లాడుతూ రాజకీయంలో పరిటాల రవి ప్రతిభను తెలియజేస్తూ
పరిటాల శ్రీరామ్ను రాజకీయాలలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. డాక్టర్
బాబూరావు దొడ్డపనేని, హరనాథ్ దొడ్డపనేని, సతీష్ వేమన, భక్త భల్ల, లక్ష్మి
దేవినేని, మోహన్ కృష్ణ మన్నవ, రాధాకృష్ణ నల్లమల ప్రభృతులు ప్రసంగించారు.
పరిటాల రవి ఆత్మశాంతి కోసం సభ ముందుగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.
ప్రవాసులను విశేషంగా ఆకర్షించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబూరావు
దొడ్డపనేని, తానా కోశాధికారి సతీష్ వేమన, తానా ట్రస్టీ నరేన్ కొడాలి, దాము
గేదెల, హరనాథ్ దొడ్డపనేని, మోహన్ కృష్ణ మన్నవ (నాటా రీజనల్ కోఆర్టినేటర్),
శైలజా అడ్లూరు (టీఏజీడీవీ అధ్యక్షులు), రవి పొట్లూరి (టీఏజీడీవీ
కార్యదర్శి) భక్త భల్ల్లా, రమణ గన్నె, రవి పొత్తూరు, లక్ష్మి దేవినేని,
పున్నమ్ మంతెన ప్రభృతులు పాల్గొన్నారు,
No comments:
Post a Comment