గామీణ ప్రాంతాల ప్రజల వద్దకే బ్యాం కింగ్ సేవలందిస్తామని ఆంధ్రప్రగతి
గ్రామీణ బ్యాంకు ఆర్ఎం మహ్మద్ఖాన్ పేర్కొన్నారు. బ్యాంకింగ్
సేవలందించడానికి ఎంపిక చేసిన బిజినెస్ కరెస్పాండెంట్లకు శిక్షణా తరగతులను
స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాలొ ్గని
మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రజల ముంగిటకు బ్యాంకు సేవలిందిం చేం దుకు
చర్యలు చేపట్టామన్నారు. హెచ్సీఎల్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ ఏర్పాట్లు
చేస్తున్నట్టు పేర్కొన్నారు. సేవ లు అందించేందుకు బిజినెస్
కరస్పాండెంట్లుగా మంచి యువకులను ఎంపిక చేశామన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి
ప్రజలకు మంచిగా సేవలందించి బ్యాంకుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూ
చించారు. ఇంతవరకు ఏ బ్యాంకు నుం చి రుణా పొందకుండా.. ఎలాంటి బకాయిలు
లేనివారు ఉంటే నిబంధనల మేరకు రుణాలు అందిస్తామన్నారు. రైతులు, కౌలు
రైతులు ఇతర వృత్తుల వారికి అర్హతనుబట్టి రుణాలిస్తామన్నా రు. ఈనెల 15 వరకు
ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని, అర్హులందరూ సద్వినియోగం
చేసుకోవచ్చ న్నారు.
No comments:
Post a Comment