తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారితిరుచానూరులో వెలసిన ఆలయరథానికి కొన్ని మరమ్మతులు చేసి, శుక్రవారం ట్రయల్రన్ నిర్వహిస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రథ చక్రాలకింద కాళ్లు నలిగిపోయి ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 21న ప్రారంభం కానున్నాయి. ఆలయ బ్రహ్మరథం చక్రాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని మార్చి హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ కలిగిన చక్రాలను అమర్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.ఈ చక్రాల మార్పిడి కార్యక్రమాన్ని ప్రముఖ ఇంజీనింగ్ కంపెనీ 'భెల్'కు అప్పగించింది.ఇందుకు అయ్యే ఖర్చులో రూ.18 లక్షల రూపాయలు టీటీడీ అందించగా మిగతా రూ.22 లక్షలు భెల్ కంపెనీ భరించే విధంగా టీటీడీ ఒప్పందం చేసుకుంది. మూడు రోజులుగా రిపేర్ల నిర్వహించి భెల్ ఇంజనీరింగ్ సిబ్బంది రథ చక్రాలను మార్పిడి చేశారు. బ్రహ్మోత్సవ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తిరుమాడవీధుల్లో శుక్రవారం ట్రయిల్ రన్ నిర్వహించారు. ఒక పరిభ్రమణం పూర్తయి తిరిగి యధాస్థానానికి చేర్చేందుకు తీసుకువస్తుండగా ఆస్థాన మండపం వద్ద అదుపుతప్పిన రథం పక్కనే ఉన్న అన్నదానం క్యూలైన్పైకి దూసుకుపోయింది
No comments:
Post a Comment