తిరుపతి నగరంలో రూ.20 కోట్లతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే చిరంజీవి ప్రకటించారు. కండలేరు నుంచి తిరుపతికి తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెస్తానన్నారు. తిరుపతిలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. జంగాలపల్లి శ్రీనివాసులు కుమారుడు మదనమోహన్, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ కుమార్తె మాధురి వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం న్యూ ఇందిరా నగర్, బా లాజీ కాలనీ, ఉప్పంగి దళితవాడ, అయ్యప్ప కాలనీ, చింతలచేనుల్లో రూ.1.8కోట్లతో చేపట్టే డ్రైన్లు, సీసీ రోడ్లు, పాఠశాల భవనానికి ఆయన భూమిపూజ చేశారు. వివిధ ప్రాం తాల్లో మాట్లాడారు. అందరిలా తాను హామీలిచ్చి మరచిపోయే వాడిని కాదని, మాటకు కట్టుబడి అభివృద్ధి చేస్తానని స్పష్టంచేశారు. నగరంలో కాలువలు, రోడ్ల నిర్మాణానికి ప్రా ధాన్యమిస్తామన్నారు.
అయ్యప్ప కాలనీలో తాగునీటి సమస్య, ఇంటి పట్టాలు, మహిళల కు రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పటికే 330 బోర్లను మరమ్మతులు చేసి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. కార్పొరేషన్ టిప్పర్ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. దీనికి సంబంధించిన ఉత్తవర్వలను జారీ చేసినట్లు కమిషనర్ ప్రసాద్ తెలిపారు. చింతలచేను చౌకదుకాణంలో కిలో రూపాయి బియ్యం పథకాన్ని చిరంజీవి ప్రారంభించారు
No comments:
Post a Comment