Friday, 4 November 2011

నకిలీ వనితా కార్డులపైన కడప డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతకం

పేద, మధ్య తరగతి ప్రజలను ఆర్టీసీకి మరింత దగ్గర చేసే నిమిత్తం ఆర్టీసీ యాజమాన్యం తెల్లరేషన్ కార్డుదారులకు 100 రూపాయలకే వనితా కార్డు పేరిట క్యాట్ కార్డులను అందజేసిన సంగతి తెలిసిందే. ఈ కార్డు ద్వారా కుటుంబంలోని మొత్తం సభ్యులందరికీ 10 శాతం రాయితీతో ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది. ప్రజలకెంతో ఉపయోగకరంగా వుండటంతో పాటు ఆర్టీసీకి కూడా వనితా క్యాట్ కార్డు ఎంతో లాభదాయకంగా ఉంది. కానీ ఇటీవల కొంత మంది అసలైన వనితా కార్డులను కలర్ జిరాక్స్ చేసి ప్రయాణికులకు అమ్మారు. నకిలీ వనితా కార్డులపైన కడప డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతకం కూడా చేసినట్లుంది
                                                                    .
ఫలితంగా నకిలీ కార్డుల వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుంది. ముందుగా కార్డులను పరిశీలించి సంతకాలు పెట్టాల్సిన డిపో అసిస్టెంట్ మేనేజర్లు తమ విధులను సక్రమంగా చేయకపోవడం వల్లే నకిలీ వనితా కార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ నకిలీ వనితా కార్డుల అవినీతిలో డిపో అసిస్టెంట్ మేనేజర్లకు భాగస్వామ్యం ఉంటుందనే సందేహం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. వనితా క్యాట్ కార్డులోని ఫొటోలను, కార్డులపై ఆర్టీసీ అధికారులు పెట్టిన సంతకాలు, వేసిన సీలును మాత్రమే కండక్టర్ పరిశీలిస్తారు. అంతేగాని డ్యూటీలో ఉన్న కండక్టర్ ఆ కార్డు ఒరిజినల్, లేక నకిలీ అని పరిశీలించే పరిస్థితి ఉండదు. కొంతమంది అవినీతి సీఐలు చేసిన మోసాల తప్పిదాలకు కండక్టర్లపై అక్రమ కేసులు బనాయించి బాధ్యులను చేస్తున్నారు

No comments:

Post a Comment