మహతి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు 'మీసేవ' కార్యక్రమాన్నిప్రారంభించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో అవినీతిని అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇక నుండి ప్రజలు ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ ఉదయం చిత్తూరు జిల్లా తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మీ కోసంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ కోసం ద్వారా ప్రజలు ఇక నుండి సులభంగా పది రకాల ధృవీకరణ పత్రాలు తీసుకోవచ్చునని చెప్పారు. ఇంతకుముందు మాదిరి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల కోసం చట్టాన్ని మార్చి దీనిని తీసుకు వచ్చామన్నారు. ప్రస్తుతం కృష్ణా, చిత్తూరు జిల్లాలో దీనిని ప్రవేశ పెడుతున్నామని, వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రవేశ పెడతామని చెప్పారు
.
ఈ సందర్భంగా మాట్లాడిన తిరుపతి కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి లోగో విషయంలో ఓ సలహా ఇచ్చారు. లోగో చాలా అద్భుతంగా కనిపిస్తోందని అయితే లోగో కింద ఉన్న త్వరగా తేలిగ్గా అనే పదాల కంటే సులభంగా వేగంగా అని ఉంచితే బాగుండేదని సూచించారు. సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా ఉంటుందనే తాను ఈ సలహా ఇస్తున్నానని ఈ విషయంలో ఆలోచించాలని ఆయన కోరారు. అన్నీ ప్రింట్ అయిపోయినందున ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు
No comments:
Post a Comment