Wednesday, 15 February 2012

అన్ని అంశాలపై చర్చకు సిద్ధం ...సిఎం

శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, నిరసనలు, ఆందోళనలు, వాయిదాలతో సభ సమయాన్ని వృధా చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలా అయితే మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టే ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్నాయని అనుకోవాల్సి ఉంటుందని సీఎం అన్నారు.ప్రతిపక్షాలు ప్రభుత్వానికి తగిన సూచనలు చేయకుండా, ఏమీ మాట్లాడకపోతే తమ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్లు నిర్ధారించుకోవాల్సి వస్తుందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాలు 31 రోజుల పాటు జరుగుతాయని, కావాలంటే సభను ఎక్కువ సమయం పెంచుకుంటూ, సభను నడుపుకుందామని, ప్రతీ ప్రశ్నకు తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment