దీంతో ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ,
వైఎస్ అభిమానుల్లోనూ ఆనందానికి రాజకీయంగా తాను ఎదిగేందుకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని మాజీ మంత్రి వైఎస్
వివేకానందరెడ్డి ఢిల్లీలోని ముఖ్యనేతలను కలిసి మంగళవారం విజ్ఞప్తి
చేసినట్లు తెలిసింది. ఈమేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె రాజకీయ
సలహాదారుడు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి జయపాల్రెడ్డి తదితర ప్రముఖులతో
ఆయన సంప్రదించి తెలిసింది. ముఖ్యంగా పొలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
కల్పించాలని, రాయలసీమలో నిర్మాణంలో ఉన్న గాలేరు, హంద్రీ నీవా సృజల స్రవంతి
ప్రాజెక్టుల పనులు సత్వర పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు విడుదల చేయాలని
కోరారు. అలాగే రాయలసీమ జిల్లాలు ఎంతో వెనుకబడి ఉన్నాయని, సీమ అభివృద్ధికి
ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని హైకమాండ్కు
విజ్ఞప్తి చేశారు. అలాగే పులివెందులలో ప్రస్తుతం గ్యాస్ సమస్య తీవ్రంగా
ఉందని, ఆ సమస్య పరిష్కారానికి వెంటనే అదనపు గ్యాస్ ఏజెన్సీ ఇవ్వాలని
కోరారు. ఇక పోతే దివంగత నేత డాక్టర్ వై ఎస్. రాజశేఖర్రెడ్డి వేలాది కోట్ల
రూపాయలు వివిధ ప్రాజెక్టులు, భారీ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారని వాటిలో
చాలా వరకు చివరి దశలోనూ, అర్ధాంతరంగా ఉన్నాయని వాటన్నింటినీ పూర్తి
చేసినట్లు అయితే ప్రజల్లో మంచిపేరు వస్తుందని హైకమాండ్ దృష్టికి
తీసుకెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా పులివెందుల నియోజక వర్గంతో పాటు
రాయలసీమ వ్యాప్తంగా వివిధ సమస్యలను పరిష్కరించడంతో పాటు జిల్లా నుంచి తనను
రాజ్యసభకు పంపినట్లయితే పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఈ ప్రాంత సమస్యలను
పరిష్కరించేందుకు వీలుగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. ఇందుకు హైకమాండ్ కూడా
సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

No comments:
Post a Comment