Wednesday, 8 February 2012

కర్నూలు జిల్లాలో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

కేడీసీసీ బ్యాంకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఈ నెల 13, 14, 15వ తేదీల్లో కర్నూలులో జర గనున్నాయి. ముంబై కేంద్రంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఆధ్వర్యంలో ఫైనల్ ఎంపిక జాబితా వెలువడనుం ది. ఈ మే రకు జిల్లాలోని 36 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు రాతపరీక్షలు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలకు అర్హ త సాధించిన వారి జాబితా కేడీసీసీ బ్యాంకు అధికారులకు పంపించింది. మొత్తం 146 మందికి లేఖలు పంపినట్టు అధికార వర్గాల సమాచారం. ఇంటర్వ్యూలో త్రిసభ్య కమిటీ..కేడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ల ఉద్యోగాలకు త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. చైర్మన్‌గా కాతా అంకిరెడ్డి, సభ్యులు గా జీఎం మరియు సీఈవో మోహన్‌రె డ్డి, నా బార్డు డీడీఎం శ్రీవత్స వ్యవహరించనున్నారు.మెరిట్‌కే పట్టం.. ఎంపికలో ఎలాంటి అవకతవకలుండవని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కాతా అంకిరెడ్డి అన్నారు. రాత పరీక్షలో ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జా బితా మాత్రమే తమకు పంపించారని, మార్కు లు పంపలేదని వివరించారు. ఇంటర్వ్యూలో త్రి సభ్య కమిటీ 5 మార్కులను నిర్ణయిస్తుందన్నా రు. అర్హత పరిశీలనలో డిగ్రీలో 75 శాతం మా ర్కులు దాటిన వారికి మెరిట్ ప్రకారం 5 మార్కు లుండగా.. కంప్యూటర్ పరిజ్ఞానానికి 5 మార్కులుంటాయని చెప్పారు. బ్యాంకింగ్, మార్కెటింగ్, వ్యవసాయ రంగ అనుభవాలకు ఏడాదికి రెండు మార్కుల చొప్పున 5 సంవత్సరాలకు 10 మార్కులు ఇస్తారన్నారు.మార్కుల విధానం ఇలా.. కేడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఎంపికకు మొత్తం మార్కులు 200. అందులో రాత పరీక్షకు 175 మార్కులుంటాయి. ఈ జవాబు పత్రాల మూల్యాంకనం ముంబై బ్యాంకింగ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది.

No comments:

Post a Comment