Wednesday, 8 February 2012

దుకాణాలకు వ్యాపారానికి లెసైన్సు తప్పనిసరి

చిత్తూరు మున్సిపాలిటీలో చేసే ప్రతి వ్యాపారానికి అధికారుల నుంచి పొందిన లెసైన్సు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. లెసైన్సు లేకుండా ఎలాంటి వ్యాపారమైనా నిర్వహించడానికి వీల్లేదన్నారు. వ్యాపారాలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. పురపాలక చట్టం-1965 ప్రకారం పట్టణాల్లో వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరూ మున్సిలిటీ నుంచి లెసైన్సు తీసుకోవాలని తెలిపారు.
మున్సిపల్ గెజిట్‌లో దాదాపు 400 రకాల వ్యాపారాలున్నాయని చెప్పారు. టీ దుకాణం నుంచి బార్బర్ షాపు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, సినిమా థియేటర్లు ఇలా అన్నీ డీ అండ్‌వో (డేంజరస్ అండ్ అఫెన్స్) ట్రేడ్స్ కిందకు వస్తాయన్నారు. వీటి నిర్వాహకులు ప్రతి ఏటా మున్సిపాలిటీ నుంచి లెసైన్సు తీసుకోవడానికి కనిష్టంగా రూ.115 నుంచి రూ.24,735 వరకు చెల్లించాలని తెలిపారు. పట్టణంలో ప్రస్తుతం ప్రతి ఏటా 2433 దుకాణాల నుంచి రూ.17 లక్షలు లెసైన్సు రుసుం కింద వసూలు చేస్తున్నామని చెప్పారు.  మొత్తం 3500 దుకాణాల నుంచి రూ.22 లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనికి కార్యరూపం దాల్చడానికి ప్రణాళికయుతంగా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారాలు చేసే ప్రతి దుకాణదారుడికీ  నోటీసులు జారీ చేస్తామని ప్రజారోగ్యశాఖ అధికారి తెలిపారు. చేసే వ్యాపారం ఆధారంగా ఎంత చెల్లించాలనే విషయం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చెబుతారన్నారు. ఆ మొత్తాన్ని ఈ నెలాఖరులోపు చెల్లించాలని చెప్పారు. ఇది ఒక సంవత్సరం చెల్లుబాటవుతుందని తెలిపారు. రెండో ఏడాది కూడా ఇంతే మొత్తాన్ని చెల్లించి రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. ప్రతి రెండేళ్ల తరువాత 15 శాతం రుసుం పెంచుతుంటామన్నారు. ఈ నెలాఖరులోపు రుసుం చెల్లించని వాళ్లు మార్చి 15వ తేదీ లోపు మొత్తం రుసుం మీద 25 శాతం అపరాధం చెల్లించాలని తెలిపారు. లేని పక్షంలో మార్చి 16 నుంచి దుకాణాలను తనిఖీ చేసి లెసైన్సు లేని వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులు సహకరించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment