Wednesday, 8 February 2012

కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయను ...మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి

వైద్య-ఆరోగ్య శాఖను విభజించిన పద్ధతిపై ఆగ్రహోదగ్రులైన మంత్రి డి.ఎల్. మనసు మార్చుకున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న డి.ఎల్. మంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలకు ప్రస్తుతానికి ఆయన తెర దించారు. కొన్ని దురదృష్ట సంఘటనలు తమను బాధించాయని ఆయన చెప్పారు.మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తాను చెప్పలేదని, కఠిన నిర్ణయం తీసుకుంటానని మాత్రమే చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడిన అనంతరం తమ కఠిన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు ఆయన చెప్పారు. మంత్రి డి.ఎల్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను వెల్లడించారు..కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయనని గుర్తు చేస్తూ పార్టీకి క్రమశిక్షణగల కార్యకర్తగా పనిచేశానని, గతంలో ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించాననీ ఆయన వివరించారు. గతంలో ఎన్నడూ పల్లెత్తు మాట పడలేదని, మంత్రి పదవి తనకు గడ్డిపోచతో సమానం అని ఆయన వివరించారు. టెన్ జన్‌పథ్‌తో మాట్లాడానని, కఠిన నిర్ణయాన్ని మానుకున్నాననీ ఆయన వెల్లడిస్తూ, తన శాఖను విడగొట్టిన పద్ధతి బాధ పెట్టిందని చెప్పారు. ముందు రోజు రాత్రి శాఖ విభజన గురించి ముఖ్యమంత్రి చెప్పారని వెల్లడిస్తూ, శాఖ విభజించిన పద్ధతే మనస్తాపం కలిగించిందని ఆయన చెప్పారు, బుధవారం రాజీనామా చేస్తారని వచ్చిన ఊహాగానాలను ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించగా, ఆ మాట తాను చెప్పలేదని ఆయన వివరించారు. మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం, శాఖలను మార్చడంవంటివి ముఖ్యమంత్రి విచక్షణాధికారాలు ఉన్నాయని, దానిని ప్రశ్నించడంలేదని డి.ఎల్. అన్నారు

No comments:

Post a Comment