Thursday, 16 February 2012

కడప - బెంగళూరు రైల్వే లైను

ఎంతో కాలంగా రైల్వే ప్రయాణికులు ఎదురు చూస్తున్న కడప - రైల్వే లైన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సారి రైల్వే బడ్జెట్‌లో 200 కోట్ల రూపాయలు కేటాయించాలని రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఎ. సాయిప్రతాప్ కోరారు. బుధవారం హైదరాబాద్‌లో రైల్వే మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో జరిగిన రైల్వే బడ్జెట్ ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఫోన్‌లో ఆయన మాట్లాడారు. కడప - బెంగళూరు రైల్వేలైన్ పనులు వెంటనే చేపట్టేందుకు రాష్ట్రం 100 కోట్లు, కేంద్రం 100 కోట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నందలూరులోని లోకో షెడ్ 200 ఎకరాల భూమి, 150 గృహాలున్నాయని, ఒకప్పుడు రైల్వేకు నందలూరు కీలక కేంద్రంగా ఉండేదని ఇప్పుడు నిరాధరణకు గురైందన్నారు. నందలూరు లోకో షెడ్‌పై ప్రత్యేక దృష్టితో రైల్వే బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలపారు. ప్రస్తుతం కడప మీదుగా వారంలో రెండు రోజులు రాకపోకలు సాగించే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రతి రోజు రాకపోకలు ఉండేలా క్రమబద్ధం చేసి రాజంపేటలో స్టాపింగ్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే కడప ఎర్రముక్కపల్లె రైల్వే రోడ్డు ఓవర్ 6 బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే బడ్జెట్‌లో 15 కోట్లు ఇవ్వాలని కోరారు

No comments:

Post a Comment