శాఖల మార్పులపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అసంతృప్తి
వ్యక్తపరిచారు. తాను పనిచేయడం లేదని శాఖల్లో కోత వేసి ఉంటే తనకు మంత్రి
పదవే అక్కర్లేదని ఆయన అన్నారు. తాను ఎవరికీ చెంచాగిరి చేయలేదని, చేయనుకూడా
అని డీఎల్ పేర్కొన్నారు. పథకాల వైఫల్యం, అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటానని
డీఎల్ స్పష్టం చేశారు. జూడాల విషయంలో తన వైఫల్యం లేదని, వచ్చే ఉప
ఎన్నికల్లో తన ప్రమేయము ఉండదని, ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని
పేర్కొన్నారు. తాను సంతోషంగా ఉన్నానని, ఇప్పటి వరకు తనకిచ్చిన బాధ్యతను
సమర్థవంగా నిర్వహించానని డీఎల్ తెలిపారు. పదవి భారం అని ఎప్పుడూ అనుకోలేదని
పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్తో తనకే విభేదాలు లేదని, వ్యవస్థల్ని
నిర్వీర్యం చేసే వారికే వ్యతిరేకినని డీఎల్ రవీంద్ర అన్నారు.పదవుల కోత విషయంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తాను పని చేయలేదని శాఖలపై కోత కోసి
ఉంటే తనకు మంత్రి పదవే అవసరం లేదని ఆయన మండిపడ్డారు. తాను ఎవరికీ చెంచాగిరి
చేయలేదని, అలా చేయను కూడా అని అన్నారు. తనకు పదవి ఉన్నా లేకున్న ప్రభుత్వ
పథకాల వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. ప్రభుత్వ పథకాలను
విమర్శించినందు వల్లనే కోత కోస్తే నన్ను పదవి నుండే తప్పించ వచ్చునని
అన్నారు. ఆరోగ్య శాఖలో జరిగిన కొన్ని సంఘటనలకు తాను బాధ్యుడిని కానన్నారు.
జూడాల విషయంలో నా వైఫల్యం లేదన్నారు. తనది ముక్కుసూటిగా వ్యవహరించే
తత్వమని, ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు.ఉప ఎన్నికల్లో తన ప్రమేయం
ఉండదన్నారు. ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే బాధ్యత
వహించాలన్నారు. కడప జిల్లాలో ఆధిపత్యం చూపాలనుకుంటున్న వారు ఉప ఎన్నికల్లో
మూడు సీట్లు గెలిపించి తమ సత్తా చూపాలని అన్నారు. పదవిలో కోత విధించి భారం
తగ్గించినందుకు సిఎంకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. తనను కేబినెట్
నుండి తప్పించినా బాధపడనని, సామాన్య కార్యకర్తగా పని చేస్తానని అన్నారు.
తనకు ఎవరితో విభేదాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానని అన్నారు.
కాంగ్రెసు వల్లనే తాను ఉన్నత స్థానానికి వచ్చానని అన్నారు.Tuesday, 7 February 2012
శాఖల మార్పులపై కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్...డీఎల్ రవీంద్రారెడ్డి
శాఖల మార్పులపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అసంతృప్తి
వ్యక్తపరిచారు. తాను పనిచేయడం లేదని శాఖల్లో కోత వేసి ఉంటే తనకు మంత్రి
పదవే అక్కర్లేదని ఆయన అన్నారు. తాను ఎవరికీ చెంచాగిరి చేయలేదని, చేయనుకూడా
అని డీఎల్ పేర్కొన్నారు. పథకాల వైఫల్యం, అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటానని
డీఎల్ స్పష్టం చేశారు. జూడాల విషయంలో తన వైఫల్యం లేదని, వచ్చే ఉప
ఎన్నికల్లో తన ప్రమేయము ఉండదని, ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని
పేర్కొన్నారు. తాను సంతోషంగా ఉన్నానని, ఇప్పటి వరకు తనకిచ్చిన బాధ్యతను
సమర్థవంగా నిర్వహించానని డీఎల్ తెలిపారు. పదవి భారం అని ఎప్పుడూ అనుకోలేదని
పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్తో తనకే విభేదాలు లేదని, వ్యవస్థల్ని
నిర్వీర్యం చేసే వారికే వ్యతిరేకినని డీఎల్ రవీంద్ర అన్నారు.పదవుల కోత విషయంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తాను పని చేయలేదని శాఖలపై కోత కోసి
ఉంటే తనకు మంత్రి పదవే అవసరం లేదని ఆయన మండిపడ్డారు. తాను ఎవరికీ చెంచాగిరి
చేయలేదని, అలా చేయను కూడా అని అన్నారు. తనకు పదవి ఉన్నా లేకున్న ప్రభుత్వ
పథకాల వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. ప్రభుత్వ పథకాలను
విమర్శించినందు వల్లనే కోత కోస్తే నన్ను పదవి నుండే తప్పించ వచ్చునని
అన్నారు. ఆరోగ్య శాఖలో జరిగిన కొన్ని సంఘటనలకు తాను బాధ్యుడిని కానన్నారు.
జూడాల విషయంలో నా వైఫల్యం లేదన్నారు. తనది ముక్కుసూటిగా వ్యవహరించే
తత్వమని, ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు.ఉప ఎన్నికల్లో తన ప్రమేయం
ఉండదన్నారు. ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే బాధ్యత
వహించాలన్నారు. కడప జిల్లాలో ఆధిపత్యం చూపాలనుకుంటున్న వారు ఉప ఎన్నికల్లో
మూడు సీట్లు గెలిపించి తమ సత్తా చూపాలని అన్నారు. పదవిలో కోత విధించి భారం
తగ్గించినందుకు సిఎంకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. తనను కేబినెట్
నుండి తప్పించినా బాధపడనని, సామాన్య కార్యకర్తగా పని చేస్తానని అన్నారు.
తనకు ఎవరితో విభేదాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానని అన్నారు.
కాంగ్రెసు వల్లనే తాను ఉన్నత స్థానానికి వచ్చానని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment