వందో సెంచరీ చేయనంతమాత్రాన సచిన్ గొ ప్పతనం ఏమాత్రం తగ్గదని
ఆస్ట్రేలియా
మాజీ కెప్టెన్ స్టీవ్ వా అన్నాడు. సచిన్ వం దో సెంచరీ చేయాలని దేశమంతా
ఎదురుచూస్తున్నందునే అతనిపై అనవసర ఒత్తిడి పెరుగుతోందని చెప్పాడు. భారత్లో
అభిమానులు గణాంకాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంటారని వా అన్నాడు.
'సచిన్ వందో సెంచ రీ చేస్తే మంచిదే. ఒకవేళ అతను సాధించలేకపోయినా గొప్ప
ఆటగాడిగా అతనికున్న ఖ్యాతి ఇసుమంతైనా తరిగిపోదు. ప్రస్తుతం 99 సెంచరీల
సచిన్ను చూస్తుం టే..99.94 సగటుతో రిటైరైపోయిన డాన్ బ్రాడ్మన్ గు
ర్తుకొస్తున్నాడని' స్టీవ్ వా అన్నాడు. గతేడాది ఏప్రిల్నుంచి వందో శతకం
కోసం సచిన్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
భారత్ అభిమానులు గతంలో సచిన్ రికార్డులని చూసి.. చూసి తన వందో సెంచరీ కోసం
ఎదురు చూస్తున్నారని.. ఐతే వందో సెంచరీ అనేది కేవలం సచిన్కు ఓ అంకె
మాత్రమేనని అన్నాడు. 'సచిన్ వందో సెంచ రీ చేస్తే మంచిదే. మరోవైపు మాస్టర్
బ్లాస్టర్ సచిన్ టెంటూల్కర్ను ఆసీస్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్తో
స్టీవ్ వా పోల్చాడు. బ్రాడ్మన్ 99 యావరేజ్తో కెరీర్ ముగించినపుడు అందరూ
బాధపడ్డారని తెలిపాడు. ఇప్పుడు సచిన్ విషయంలోనూ 99 ఆడుకుంటుందని
అన్నాడు.ఐతే సచిన్ అతి త్వరలోనే వందో సెంచరీ సాధించితీరతాడని వా ఆశాభావం
వ్యక్తం
చే శాడు. ఐతే గత ఏప్రిల్నుంచి సచిన్ వందో సెంచరీ కోసం వెయిట్ చేస్తూనే
ఉన్నా ఇప్పటికీ ఆ రికార్డు ఊరిస్తూనే ఉంది. ఇంగ్లండ్, విండీస్, ఆసీస్లతో
జరిగిన సిరీస్లలో దగ్గరకు వచ్చినా మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయాడు.

No comments:
Post a Comment