Tuesday, 7 February 2012

వ్యక్తిగత ఆదా యం పన్నుచెల్లింపుదార్లకు వేతనజీవులకు బడ్జెట్‌లో ఊరట..!

వేతన జీవులు, వ్యక్తిగత ఆదా యం పన్ను చెల్లింపుదార్లకు రానున్న బడ్జెట్‌లో ఆర్థి కమంత్రి కొంత ఊరట కలిగించనున్నారు. ప్రత్యక్ష పన్నుల కోడ్ (డిటిసి) సిఫార్సులను దృష్టిలో ఉంచు కొని వ్యక్తి గత ఆదాయం పన్ను మిన హాయంపు పరిమితిని రెండు లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయంచినట్లు తెలుస్తోంది. అయతే ఇప్పుడున్న ద్రవ పరిస్థితి రీత్యా ఇతర పన్ను రేట్లు తగ్గించేందుకు అవకాశం లేదని భావిస్తున్నారు. ప్రస్తుతం పార్ల మెంటరీ స్థాయా సంఘం పరిశీలనలో ఉన్న డిటిసిలో ఆదాయం పన్ను రాయతీ పరిమి తి ఇప్పుడున్న రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని సిఫార్సు చేశారు. అలాగే గరిష్ఠ ఆదాయ పన్ను రేటు 30% ప్రస్తుతం అమల్లో వున్న రూ.8 లక్షల వార్షిక ఆదాయం గలవారికి కాకుండా రూ.10 లక్షల రాబడి గలవారికి వర్తింప జేయాలని డిటిసి ప్రతిపాదిం చింది. కాగా, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మార్చి ద్వితీయా ర్ధంలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర పన్ను రేట్లను యథాతథంగా కొనసాగిం చినా, అధిక ద్రవ్యోల్బణం రీత్యా ఆదాయం పన్ను శ్లాబ్ పెంచాలని పారి శ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. వ్యక్తిగత ఆదాయం పన్ను మిన హాయంపు పరిమితి రూ.1.8ం లక్షల నుంచి రూ.2 లక్షలకు హెచ్చిం చాలని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయతే ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపధ్యంలో వ్యక్తిగత ఆదాయం పన్ను రేట్లను తగ్గించకూడదని, అయతే గరిష్ఠ 30% పన్ను రేటును రూ.8 లక్షల వార్షికాదాయం గలవా రికి కాకుండా రూ.10 లక్షల స్థాయ గలవారికి వర్తింపజేయాలని ఫిక్కి ప్రధాన కార్యదర్శి రాజీవ్‌కుమార్ అన్నారు. అసోచామ్ అధ్యక్షుడు మాట్లాడుతూ బేసిక్ పన్ను మినహాయంపు పరిమితి రూ.2 లక్షలకు విస్తరించాలని కోరారు. రూ.2 లక్షలకు పైన, రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి 10% పన్ను రేటు వర్తింప జేయాలని సూచించారు.

No comments:

Post a Comment