Sunday, 26 February 2012

భారత్ ఓటమి, టోర్ని నుంచి ఔట్!

ముక్కోణపు వన్డే సిరిస్‌లో భాగంగా భారత్ - ఆస్టేలియా మద్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాపై ఆసీస్ 87 పరుగుల విజయంతో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో టీమిండియాని ఓడించడంతో ముక్కోణపు సిరిస్‌లో ఆసీస్ ఫైనల్‌కు చేరగా టీమిండియా ఇంటి బాట పట్టనుంది. మొదట టాస్ గెలిచి ఆస్టేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి గాను 252 పరుగులు చేసింది. ఆస్టేలియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 68 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో డేవిడ్ హస్సీ 54, వేడ్ 56 పరుగులు చేశారు. ఇక ఇండియన్ బౌలర్స్‌లలో సెహ్వాగ్ 3 వికెట్లు తీసుకోగా, ప్రవీణ్ కుమార్, యాదవ్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ 5, సచిన్ టెండూల్కర్ 14 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గంభీర్ 23, కోహ్లీ 21 పరుగులతో నిష్క్రమించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ధోని తనదైన శైలిలో ఆటను ప్రదర్శించినప్పటికీ హిల్ఫన్‌హాస్ వేసిన బంతిలో ఎల్ బిడబ్ల్యు గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 8, స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ 26, ఇర్పాన్ పఠాన్ 22 పరుగులతో పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆసీస్ బౌలర్స్‌లలో షేన్‌ వాట్సన్, దోహార్తి, హిల్ఫన్‌హాస్ రెండేసి వికెట్లు తీసుకోగా... క్రిస్టేన్, మెక్ కే, బ్రెట్ లీ తలో వికెట్ తీసుకున్నారు. ఆస్టేలియాలో అత్యధికంగా పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ 68 కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.టీమిండియాపై ఆసీస్ విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్దానంలోకి వెళ్లడమే కాకుండా ముక్కోణపు వన్డే సిరిస్‌ ఫైనల్ బెర్తుని ఖరారు చేసుకుంది. ఇక శ్రీలంక 15 పాయింట్లతో రెండవ స్దానంలో ఉంది. మంగళవారం టీమిండియాకి శ్రీలంకతో మ్యాచ్‌లో ఫైనల్‌కు చేరే అవకాశాలు లేవు.

No comments:

Post a Comment