అయితే జిల్లాలో ఇటీవల జరు గుతున్న
కొన్ని పరిణామాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. బాధ్యత గల ఉద్యోగులమనే
విషయం విస్మరించి వీధి గూండాల్లా వ్యవహరించారు.
ఇతరులెవరైనా తగవులాడుకుంటే సర్ది చెప్పి పంపాల్సిన 'పెద్దరికం' వారిది.
కానీ వారే కండకావరంతో కసాయిల్లా ప్రవర్తించారు. తమ 'నాగరికత' ఇదీ అని
చాటుకున్నారు. ఇంతకాలం రౌడీషీటర్లను, ఫ్యాక్షనిస్టులను జిల్లా నుంచి
పోలీసులు
బహిష్కరించేవారు. ఇప్పుడు వారికే అలాంటి దుర్గతి ఏర్పడిందంటే కార ణం
స్వయంకృతమే. ఇలాంటి పరిస్థితు ల్లో ఎస్పీ పట్టుదలకు పోకుండా నిష్పాక్షికతను
నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆయన తూతూ మం త్రంగా వ్యవహరిస్తే నష్టపోయేది
పోలీ సు శాఖే. అయితే ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని, పద్ధతి ప్రకారం విచారణ
జరిపించి చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అదే స మయంలో కొందరు గ్రామస్థుల్లో మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందం టూ
తన మనసులో మాట చెప్పకనే చె ప్పారు. కళ్లకు కనిపించే నగ్న సత్యానికి మించి
సాక్ష్యమేమి కావాలి.
ప్రజాభిప్రాయానికి మిం చిన విచారణ మరొకటేముం
టుంది? ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడమంటే 'మసిపూసి మారేడు
కాయ'చేసే ప్రయత్నమే అవుతుంది. ఒకసారి ప్రజల్లో విశ్వాసం కోల్పోయాక తిరిగి
దాన్ని పాదుగొల్పడం అంత సులువైన పని కాదని గతవారం 'వ్యాఖ్యానం'లో
చెప్పుకున్నాం. వృత్తి ధర్మాన్ని విస్మరించి పోలీసులు అసాంఘిక శక్తుల్లా
నడుచుకుంటూపోయినంత కాలం వారు ప్రజాగ్రహానికి గురవుతూనే ఉంటారు. తర చూ
ఇలాంటి సంఘటనలు జిల్లాలో జరుగుతు న్నాయంటే మన పోలీసులు ఎటువైపు
పయనిస్తున్నట్లు? ఎస్పీ ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కితే ఇక పో లీసు
'బూచి' ఇక తొలగేదెన్నడు? సమాజమేగతి బాగుపడేను?
పిల్లలను దారిలోకి తెచ్చుకోవడానికి ఒకప్పుడు తల్లిదండ్రులు పోలీసులను
'బూచి'గా చూపే వారు. అప్పట్లో ఖాకీలంటే ఉండే భయం అదీ.. స్వాతంత్య్రం రాక
ముందు బ్రిటిష్ పోలీసులు ఎంతో కర్కశంగా వ్యవహరించే వారు. వారి అరాచకాలు,
అఘాయిత్యాలకు అంతు ఉండేది కాదు. అందుకే వారంటే జనం జడుసుకునేవారు. దాని
ప్రభావమే 'బూచి' రూపంలో అలా వ్యక్తమ య్యేది. రానురాను పరిస్థితుల్లో మార్పు
వచ్చింది. పోలీసులు, ప్రజల మధ్య కొంతవరకు సంబం ధాలు మెరుగుపడ్డాయి.
పోలీసులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం అలవరుచు కున్నారు. ప్రజలతో
మమేకం కావడానికి ప్రయత్నించారు. అలాగని అంతా సస్వరులయిపో యారని చెప్పలేం
గానీ కొంతలో కొంత మార్పయితే వచ్చింది. దొంగలతో పోలీసులు చేతులు
కలపడమంటే వింతగానూ, విడ్డూరంగానూ లేదూ? వారితో దొంగతనాలు, దోపిడీలు
చేయిస్తూ వాటాలు పంచుకునేవారంటే జుగుప్స కలిగించడం లేదూ? అంతెందుకు?
జిల్లాలో సంఘ టనను మానవమాత్రులెవరైనా సమర్థిస్తారా? ఏమి జరిగిందని
అక్కడి పోలీసులు పూనకం వచ్చి నట్లు ప్రవర్తించారో అర్థం కావడం లేదు. తాము
పోలీసులమనే అహంతో కన్నూమిన్నూ కాన కుండా నడుచుకున్నారు.
అనంతపురం జిల్లాలో 'మా వాళ్లతోనే పెట్టుకుం టారా?' అన్నట్లు ఉంది ఆయన వ్యవహార సరళి. తాము మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నామనే స్పృహ కూడా వారికి కలగలేదు. ప్రజాస్పందనను గురించిన ఆలోచన కూడా వారికి ఏమాత్రం వచ్చినట్లు లేదు. తాము ఏమి చేసినా చెల్లుబాటవుతుందనుకున్నారు. అయితే ఆ తరువాత పరిస్థితి వారి చేయి దాటిపోయిం ది. గ్రామస్థులంతా ఏకమయ్యా రు. ఒక్కసారిగా పోలీసు స్టేషన్ను ముట్టడించారు. ఏకధాటిగా 8 గంటల పాటు కొత్తచెరువును దిగ్బంధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఒక డీఎస్పీ, ఎనిమిది మంది సీఐ లు, పో లీసు అదనపు బలగాలు రంగంలోకి ది గాల్సి వచ్చింది.
No comments:
Post a Comment