Monday, 13 February 2012

చేనేత కార్మికుల నేనున్నానంటూ భరోసా...జగన్‌మోహన్‌రెడ్డి

చేనే త కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పాలకులు పట్టించుకున్న పా పానపోలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల కళ్లు తెరిపించడానికే తాను 48 గం టలపాటు నిరాహారదీక్ష చేపట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నా రు.చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు కార్మికులు పోటెత్తారు. వేలాదిగా నేతన్నలు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. అనంతపురం నుండే కాక పొరుగున వున్న కర్నాటక నుండి కూడ భారీగా ఇక్కడకు చేరుకున్నారు.ఆత్మహత్యలు చేసుకున్న చేనేతల కుటుంబ సభ్యులు తమ సమస్యలను జగన్ వద్ద విన్నవించుకుంటున్నారు. వారి సాధకబాధకాలను అవగతం చేసుకున్న ఆత్మీయనేత చేనేతల కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమం త్రి అయ్యాక చేనేతల రుణాల మాఫీ కోసం రూ.312కోట్లు మంజూరు చేశారన్నారు. చేనేతల కోసం బడ్జెట్‌లో కే టాయించిన రూ.312 కోట్లు నిధులు ఆయన మృతి చెందిన తరువాత కూ డా విడుదల చేయలేదన్నారు. రేపోమాపో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయని ఈ తరుణంలో తాను చేపట్టనున్న దీక్ష కారణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అవుతుందన్నారు.వీటితోపాటు విద్యార్థుల ఫీజు రీ యింబర్స్‌మెంటు పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థులు, చేనేతల సమస్యలపైనే ప్రధాన అజెండాలుగా 48 గంటలపాటు నిరాహార దీక్షకు పూనుకున్నట్లు ఆయన వెల్లడించారు.

No comments:

Post a Comment