సుస్థిర పాలన అందివ్వగలిగింది తెలుగుదేశమే...చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారేవరకు రైతు సమస్యలపై రాజీలేని పోరాటం
సాగిస్తానని, రైతులు, పేదల కోసం తమ ప్రాణాలైనా ఇస్తానని తెలుగుదేశం
పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర
సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ప్రధాన పంటలు సాగుచేస్తున్న రైతులు
పెట్టుబడులు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో ఆయన గురువారం 'రైతు పోరుబాట'
నిర్వహించారు. మధ్యాహ్నం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వరసిద్ధి
వినాయకుని దర్శించుకున్న అనంతరం రెండు గంటలకు అగరంపల్లె నుంచి పాదయాత్ర
ప్రారంభించారు. అగరంపల్లె కూడలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ
ఎరువులు, క్రిమిసంహారక మందులు, డీజిల్, కూలీల ఖర్చులు విపరీతంగా
పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వం పదేపదే ఎరువుల ధరలు పెంచుతూ పోవడంతో డీఏపీ
బస్తా ధర రూ.400 నుంచి రూ. 1200కు పెరిగిపోయిందని, బ్లాక్ మార్కెట్లో
వీటిని మరింత అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితిని
చక్కదిద్ది రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా
విఫలమైందన్నారు.ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తిరుపతి శాసనసభ్యుడు
చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చంద్రబాబు
కాణిపాకం నుండి తన రైతు పోరు బాట యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. బొత్స రాష్ట్రంలో లిక్కర్ డాన్గా మారారని ఆరోపించారు. కుటుంబ
సభ్యుల ద్వారా ముఖ్యమంత్రి డబ్బు దండుకుంటున్నారని విమర్శించారు. పాలన
పక్కన పెట్టి కాంగ్రెసు నేతలు పదవుల కోసం ఢిల్లీ చుట్టూతిరుగుతున్నారన్నారు. చిరంజీవిది కూడా అదే పరిస్థితి అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. మద్యం మాఫియా
విచ్చలవిడిగా రాజ్యమేలుతోందన్నారు. చెత్త నేతలు అధికారం కోసం పాట్లు పడటం
శోచనీయమన్నారు. రైతు పోరు బాట ప్రభుత్వానికి చెంప పెట్టు అన్నారు.తెలుగుదేశం
పార్టీయే రాష్ట్రంలో సుస్థిర పాలన ఇస్తుందన్నారు. పార్టీకి పూర్వ వైభవం
వస్తుందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం పాలనను, రైతులను పూర్తిగా నిర్లక్ష్యం
చేస్తోందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామన్నారు.
కాగా ఈ నెల 20వ తేది నుండి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.
భారీ వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ఆయన కందుకూరు
నియోజకవర్గానికి వెళ్లనున్నారు
No comments:
Post a Comment