Thursday, 19 January 2012

తిరుపతి రైల్వే స్టేషన్ అంతర్జాతీయ గుర్తింపు


తిరుపతి రైల్వే స్టేషన్‌ను మరో ఐదేళ్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్టు ఎంపి డాక్టర్ చింతామోహన్ తెలిపారు. 125 సంవత్సరాల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. అప్పట్లో 2 రైళ్లు వచ్చేవని, 5వేల మంది ప్రయాణికులు తిరుపతి వచ్చేవారన్నారు. అయితే నేడు 75 రైళ్లు తిరుపతికి ప్రతిరోజు వస్తుండగా, సరాసరి లక్ష మంది ప్రయాణిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ రైల్వే స్టేషన్‌గా విస్తరింపజేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి 300 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుత రైల్వే స్టేషన్‌ను అలాగే ఉంచి తిరుపతి వెస్టు రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే వెస్టు రైల్వే స్టేషన్‌లో రైల్వేకి సంబంధించి 50 ఎకరాల భూమి ఉందన్నారు. మరో 20 ఎకరాలు ఇచ్చేందుకు టిటిడి సిద్ధంగా ఉందన్నారు. మరో ఐదేళ్లలో అంతర్జాతీయ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోనున్నదన్నారు.

No comments:

Post a Comment