ఫామ్లో ఉన్నది క్రికెట్ దేవుడొక్కడే...డేవిడ్ వార్నర్
టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్ బ్యాట్స్మెన్ల్లో ఫామ్లో ఉన్నది సచిన్
ఒక్కడేనని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. సిరీస్లో సచిన్
మినహా భారత బ్యాట్స్మెన్ విఫలమవుతున్నారని వార్నర్ చెప్పాడు. కాగా
అడిలైడ్ టెస్టులో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడవచ్చని భావిస్తున్నట్టు
తెలిపాడు. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్లోగా నెంబర్వన్ స్థానాన్ని మళ్లీ
కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని చెప్పాడు.25 సంవత్సరాల వయసు కలిగిన డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ టీమిండియాలో చాలా మంది
బ్యాట్స్ మెన్ ఉన్నప్పటికీ, నా మైండ్లో మాత్రం పరుగులు చేసే
బ్యాట్స్మెన్గా కేవలం ఒక్క సచిన్ మాత్రమే కనిపిస్తున్నాడని అన్నాడు.
టీమ్లో మిగిలిన బ్యాట్స్మెన్ ప్రపంచ శ్రేణి ఆటగాళ్లుగా సంబోధించాడు. ఈ
టెస్టు సిరిస్ లో వారు చేసిన స్కోరుని గనుక చూసినట్లేతే కేవలం అతి తక్కువ.
అడిలైడ్లో జరగబోయే నాల్గవ టెస్టులో ఆసిస్ ఆటగాళ్లు కొత్త చరిత్రను
తిరగరాయనున్నారని అన్నాడు.ఈ
సిరిస్లో సచిన్ టెండూల్కర్ ఆఫ్ సెంచరీ చేసినప్పటికీ, తన వందో సెంచరీని
చేయడంలో విఫలమయ్యాడని అన్నాడు. ఇప్పటికే టీమిండియా 0-3తో పరాజయాన్ని
మూటగట్టుకుందని తెలిపాడు. టీమిండియా ఒత్తిడితో ఉండడం వల్లనే విదేశీ గడ్డపై
ఏడు మ్యాచ్లు వరుసగా ఓడిపోయిందని తెలిపాడు. నాల్గవ టెస్టులో కూడా
టీమండియాని ఓడించి, వైట్ వాష్ చేసే దిశగా ఆసిస్ ఆలోచిస్తుందని అన్నాడు. పెర్త్లో
జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 37 పరుగుల విజయం సాధించిన తర్వాత ఆసిస్
కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మాట్లాడుతూ ప్రపంచంలో రెండవ స్దానంలో ఉన్న
టీమిండియాని ఓడించిన సందర్బంలో ఎంజాయ్ చేయండని టీమ్ సభ్యులకు తెలిపిన విషయం
తెలిసిందే.
No comments:
Post a Comment