Thursday, 19 January 2012

రిటైర్‌మెంట్ ఆలోచన లేదు.... వివిఎస్ లక్ష్మణ్



ఆస్టేలియా టూర్‌లో పేలవ ఫామ్‌ తో సతమతమౌతూ తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎట్టకేలకు నోరు విప్పాడు. తన రిటైర్మెంట్‌ పై వస్తున్న విమర్శలకు, ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. నాలుగో టెస్టు కోసం బుధవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌ అనంతరం ఓ భారత విలేఖరితో తన రిటైర్మెంట్‌ ఇప్పట్లో ఉండదని చెప్పినట్లు ది ఏజ్‌ పత్రిక ప్రచురించింది. ఆసీస్‌ పై మూడు టెస్టుల్లో కేవలం 17 సగటుతో 102పరుగులు చేసిన లక్ష్మణ్‌, ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించి విషయం తెలిసిందే.నాలుగు టెస్టుల ఆస్టేలియా సిరిస్‌లో వివిఎస్ లక్ష్మణ్ రెండు సార్లు డకౌట్‌ అయ్యాడు. ఒకే ఒక్క అర్థసెంచరీ చేశాడు. దీంతో అతడిని టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వాలంటూ మాజీలు ఒత్తిడి చేయడం జరిగింది. దీంతో మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఆసీస్‌ పర్యటనలో వైఫల్యానికి ఒక్కరినే ఎందుకు బాధ్యుడ్ని చేస్తారు? అలా బాధ్యుల్ని చేస్తే మొత్తం ఏడుగురు బ్యాట్స్‌మన్లను చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఇక్కడ మేం సమష్టిగా విఫలమయ్యాం. దీనికి టాప్ ఏడుగురు బ్యాట్స్‌మెన్ అందరూ బాధ్యత వహించాలి. ప్రస్తుతం ఆస్టేలియాలో జరగుతున్న నాలుగు టెస్టు సిరిస్‌లో ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన వివిఎస్ లక్ష్మణ్ 17 సగటుతో కేవలం 102 పరుగులు సాధించి విమర్శకులకు తన రిటైర్‌మెంట్ గురించి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మూడు టెస్టుల్లో పరాజయాన్ని మూట గట్టుకోని సిరిస్‌ని కోల్పోయిన టీమిండియా విమర్శకుల మాటలకు సమాధానాన్ని చెప్పలేక పోయినప్పటికీ, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ను తప్పించాల్సిందేనని భారత్‌లో మాజీ క్రికెటర్లు, సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నా, టీమిండియా సభ్యులు ఆయనకు బాసటగా నిలిచారు.మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఆసీస్‌ పర్యటనలో వైఫల్యానికి ఒక్కరినే ఎందుకు బాధ్యుడ్ని చేస్తారు? అలా బాధ్యుల్ని చేస్తే మొత్తం ఏడుగురు బ్యాట్స్‌మన్లను చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఇక్కడ మేం సమష్టిగా విఫలమయ్యాం. దీనికి టాప్ ఏడుగురు బ్యాట్స్‌మెన్ అందరూ బాధ్యత వహించాలి. కానీ లక్ష్మణ్ ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అతడు భారత క్రికెట్ దిగ్గజం. చాలా ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇతరులెవరు నిర్ణయించడానికి.. ఏదైనా తన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ విమర్శించదలుచుకుంటే లక్ష్మణ్ ఒక్కడినే కాదు.. ఓటమికి కారణమైన మొత్తం బ్యాటింగ్ విభాగాన్ని తప్పుపట్టాల్సి ఉంటుందని అన్నాడు కానీ లక్ష్మణ్ ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అతడు భారత క్రికెట్ దిగ్గజం. చాలా ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇతరులెవరు నిర్ణయించడానికి.. ఏదైనా తన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ విమర్శించదలుచుకుంటే లక్ష్మణ్ ఒక్కడినే కాదు.. ఓటమికి కారణమైన మొత్తం బ్యాటింగ్ విభాగాన్ని తప్పుపట్టాల్సి ఉంటుందని అన్నాడు. దానికి వీవీఎస్‌ కూడా ఇప్పట్లోనే తన రిటైర్మెంట్‌ ఉండదంటూ సూచనలు పంపించాడు. ఈనెల 24నుంచి అడిలైడ్‌లో జరుగనున్న నాలుగో టెస్టులో ఎలా అయినా రాణించాలని వీవీఎస్‌ తపిస్తున్నాడు.

No comments:

Post a Comment