డీఎస్సీ-12లో
జిల్లాకు అతి తక్కువ పోస్టులు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష
నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు,డీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాకు
దాదాపు 500 నుంచి 600 వరకు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాల్సి ఉండగా,
కేవలం 97 మాత్రమే మంజూరు చేశారని తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులను
సంప్రదించకుండా ప్రభుత్వం తక్కువ పోస్టులను కేటాయించడాన్ని ఉపాధ్యాయ
సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పస్తుత డీఎస్సీలో అనంతపురం జిల్లాకు
గణితం-77, భౌతికశాస్త్రం-52, సామాన్యశాస్త్రం-17, ఆంగ్లం-30,
సాంఘికశాస్త్రం-66, కర్నూలు జిల్లాకు గణితం-69,
భౌతికశాస్త్రం-115,సామాన్యశాస్త్రం-58, ఆంగ్లం-82, సాంఘికశాస్త్రం-84,
చిత్తూరుకు గణితం- 94, భౌతికశాస్త్రం-105, సామాన్యశాస్త్రం-18, ఆంగ్లం-68,
సాంఘికశాస్త్రం-85 కేటాయించారు. వైఎస్సార్ జిల్లాకు కేటాయించిన 97
పోస్టుల్లో గణితం-21, భౌతికశాస్త్రం-32, సామాన్యశాస్త్రం-2, ఆంగ్లం-20,
సాంఘికశాస్త్రం-14 ఉండగా, మిగిలినవి భాషకు సంబంధించినవి. ఈ 97 పోస్టుల్లో
కూడా 70 శాతం ప్రమోషన్లు ఇస్తారు. గత నుంచీ అన్యాయమే గత
డీఎస్సీల నుంచి కూడా జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. ఉపాధ్యాయ సంఘాలు
ఉద్యమాలు చేస్తేనే మరికొన్ని పోస్టులను కలుపుతున్నారు. 1994 డీఎస్సీలో
అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీ రంగారావు విడుదల చేసిన నోటిఫికేషన్లో కడపకు
182 పోస్టులు మంజూరు చేశారు. దీన్ని నిరసిస్తూఉద్యమిస్తే అదనంగా 417 ఖాళీలు
చూపించారు. డీఎస్సీ-94 రాసిన అభ్యర్థులకు 1997జనవరి 12న అప్పటి కలెక్టర్
బిఆర్ మీనా 198 మందికి పోస్టులిచ్చారు. డీఎస్సీ-2008లో కూడా దాదాపు 596
పోస్టులు ఇచ్చారు. ఇవి తక్కువని పోరాటాలు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్
రాజశేఖరరెడ్డి దాదాపు 90 పోస్టులు పెంచారు. దీంతో ఎస్జీటీ పోస్టులు 646కు
పెరిగాయి. వీరిలో ఇంకా 52మందికి ఉద్యాగాలివ్వాల్సి ఉంది. వీరికి హామీ
పత్రాలు కూడా ఇచ్చారు.
No comments:
Post a Comment