Friday, 6 January 2012

శ్రీ రామ రాజ్యం యాభై రోజులు వేడుకలో...సిఎం బాలయ్య అంటూ నినాదాలు

శ్రీ రామ రాజ్యం యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన అర్ధశత దినోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ అభిమానులు సిఎం బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ మాట్లాడటానికి వస్తుండగా అభిమానులు ఒక్కసారిగా కాబోయే సిఎం బాలయ్య అంటూ నినాదాలు చేశారు. శ్రీ రామ రాజ్యం అర్ధ శతదినోత్సవ వేడుక అర్ధరాత్రి వరకు సాగింది. ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు మాట్లాడుతూ... లవకుశ, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు యుగానికి ఒక్కసారే వస్తాయని, రికార్డులు కొట్టేశాం అని జబ్బలు చరుచుకునే వారు ఒక్కసారి ఆలోచించాలని, ఒక సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు రాబట్టిందనేది ముఖ్యం కాదని, ఎన్ని లక్షల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నదన్నదే ముఖ్యమన్నారు.నయనతారను అందరూ ప్రత్యేకంగా అభినందించారు. మీడియా ద్వారా నయనతార నటించవద్దని నిర్ణయం తీసుకుందని తెలుసుకున్నానని, దానిని వెనక్కి తీసుకోవాలని దాసరి సూచించారు. బాలకృష్ణ గొప్ప గొప్ప పాత్రలతో ముందుకెళుతున్నారని ఆయనకు నీలాంటి నటి కావాలన్నారు. సావిత్రి, జయసుధ, జమున వంటి మహానటీమణులు పెళ్లైన తర్వాత కూడా అద్బుతమైన పాత్రలు వేసి మెప్పించారన్నారు.

No comments:

Post a Comment