Friday, 6 January 2012

ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేదిలేదు..టెట్ డైరెక్టర్

ఈ నెల 8వ తేదీ ఆదివారం నుంచి జరిగే టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు హాజరయ్యే అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేదిలేదని టెట్ డైరెక్టర్ శేషుకుమారి చెప్పారు. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 2100 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పకడ్బందీగా చేపట్టాలని అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్ చెన్నకేశవరావు అధికారులను ఆదేశించారు.  రెవెన్యూభవన్‌లో టెట్ నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అదనపు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ టెట్‌కు విద్యాశాఖ తప్ప ఇతర శాఖల అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పొరపాట్లకు తావీయకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల కోసం ఇచ్చే ప్యాకేజ్ మెటిరీయల్స్‌ను అధికారులు సరిచూసుకోవాలని అన్నారు. ఏడో తేదీనే మెటీరియల్ మొత్తం అందిందా, సెంటర్ లో ఫర్నీచర్స్, తాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా చూసుకోవాలన్నారు. ఏమైనా లేకపోతే రూట్ అధికారులకు, డీఈఓకు ఫిర్యాదు చేయాలన్నారు పేపర్1 కంటే పేపర్2కు ఎక్కువ మంది అభ్యర్థులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. 1 నుంచి 16 సెంటర్ల అధికారులు ఉదయాన్నే రావాలని, మిగిలిన 89 సెంటర్స్ అధికారులకు మధ్యాహ్నం ఉంటుందని తెలిపారు పోలీస్‌బందోబస్తు కోసం పోలీసుఅధికారులకు లేఖ రాయాలని డీఈఓ ప్రేమానందంను ఆదేశించారు. బుక్‌లెట్లు పరీక్షా సమయానికి గంటముందే కేంద్రానికి అందుతాయని, వాటిని మొత్తం ప్రత్యేక సూపరింటెండెంట్స్ సమక్షంలో తెరవాలని సూచించారు. ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించి టెట్ పరీక్షలను విజయవంతం చేయాలని కోరారు.ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు డీఎడ్ అభ్యర్థులకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎడ్ అభ్యర్థులకు పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు.

No comments:

Post a Comment