Wednesday, 18 January 2012

ఎన్టీఆర్ నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు



బాలకృష్ణది చిన్నపిల్లాడి మనస్థత్వం అన్న చిరంజీవి వ్యాఖ్యలపై బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి మాటలు నేర్చారని, మంత్రి పదువుల కోసం ఢిల్లీలో బేరసారాలు ఆడే వ్యక్తి గురించి తానేమీ మాట్లాడనని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారంటే అది ఆయన ఇష్టమన్నారు.పార్టీ ప్రచారానికి రావచ్చు, రాకపోవచ్చు అని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ అందరికీ ఆరాద్య దైవం అని కొనియాడారు. ఎన్టీఆర్‌కు తాము రాజకీయ వారసులం కాదని, పార్టీ కార్యకర్తలమని బాలకృష్ణ తెలిపారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు 16 వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, దగ్గుబాటి తదితరులు ఎన్టీఆర్ ఘాట్‌కు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ నాయుడు ఎన్టీఆర్‌కు నివాళులులర్పించారు. అనేక మంది టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్‌కు తరలివచ్చారు.

No comments:

Post a Comment