కలియుగ వైకుంఠం తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉందని
పార్లమెంట్ అంచనాల కమిటీ పేర్కొంది. తిరుపతికి ఉన్న గుర్తింపును దృష్టిలో
ఉంచుకొనే రైల్వే స్టేషన్, విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి
దిద్దేందుకు కృషి చేస్తున్నామని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. తిరుపతిలో
సమావేశమైన కమిటీ అభివృద్ధి పనులను సమీక్షించింది. మరో రెండు నెలల్లో
తిరుపతిలో రాత్రి వేళల్లో విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని
కమిటీ సభ్యులు తెలిపారు. రానున్న ఐదేళ్లలో తిరుపతి రైల్వే స్టేషన్ను
అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు.
No comments:
Post a Comment