Monday, 2 January 2012

జగన్ అక్రమాస్తుల కేసులో తొలి అరెస్ట్...జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి

జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి అరెస్ట్ సోమవారం ఉదయం నుంచి దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌లో విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ సాయంత్రం ఆయనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయసాయిరెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సీబీఐ కారణాల్ని వెల్లడించలేదు. విజయసాయిరెడ్డిపై 120(బి), 409, 477, 477(ఏ) సెక్షన్ల కింద డిసెంబర్ 17 తేదిన కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ అండ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్13 క్లాజ్ 4 కింద మొత్తం 72 మందిపై సీబీఐ అభియోగాలు మోపారు. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ పరిధిని మించి విచారణ చేస్తోందని విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసులో పదుల సార్లు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఎవర్ని కూడా ఇన్నిసార్లు సీబీఐ ప్రశ్నించలేదు.ఈ రోజు ఉదయం నుంచి విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా విచారించిన సి.బి.ఐ మరి కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందకు హాజరు పరచనున్న సి.బి.ఐ బెంగళూరులో ఉన్న జగన్ విజయసాయిరెడ్డి అరెస్ట్ పై స్పందించవద్దని పార్టీ నేతలను ఆదేశించిన జగన్.

No comments:

Post a Comment