పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని...సూరి భార్య గంగుల భానుమతి
పరిటాల కుటుంబం, ఆయన అనుచరులే సూరిని హత్య చేశారని సూరి భార్య గంగుల
భానుమతి ఆరోపించారు. మంగళవారం ఉదయం మీడియతో మాట్లాడుతూ పరిటాల కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని మద్దిలచెర్వు సూరి భార్య గంగుల
భానుమతి భయం వ్యక్తం చేశారు. తన భర్త హత్యకు పరిటాల కుటుంబీకులే కారణం అని
ఆరోపించారు. టిడిపి నేతలతో కుమ్మక్కై తన భర్తని భానుయే హత్య చేశాడని ఆమె
ఆరోపించారు. భాను బతికే ఉన్నాడని ఆమె చెప్పారు. పోతుల సురేష్, చమన్
సహకారంతో తనని హత్య చేసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. పటోళ్ల, సూరి
హత్యలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. సూరి హత్య తరువాత తమ కుటుంబం కష్టాల్లో
ఉందని ఆమె చెప్పారు.
No comments:
Post a Comment